450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఆవిర్భవించినట్టుగానే, అనంత విశ్వంలో భూగ్రహాన్ని పోలిన మరికొన్ని గ్రహాలు అక్కడక్కడ పరిభ్రమిస్తున్నట్టు శాస్త్రవేత్తల అంచనా. భూమిపై అంతకంతకూ పెరిగిపోతున్న కాలుష్యం, జనాభా పెరుగుదల వెరసి నివాసానానికి మరో గ్రహం అత్యావశ్యకమయ్యే పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. చంద్రుడు, అంగారకుడిపై నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ఇంకా దశాబ్దాల కాలం పట్టొచ్చు. ఈ క్రమంలోనే భూమిని పోలిన కొత్త గ్రహాలను అన్వేషించే పనిలో పడ్డారు చైనా శాస్త్రవేత్తలు. గతేడాది 55 స్పేస్ మిషన్లతో రికార్డు సృష్టించిన డ్రాగన్..
నివాస యోగ్యతలు కలిగిఉన్న మరో గ్రహాన్ని అన్వేషించడానికి ఉద్దేశించిందే ‘ఎర్త్ 2.0’ మిషన్. చైనీస్ పరిశోధకులు ఈ కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. వచ్చే జూన్ నాటికి మిషన్ ప్రొటోటైప్, టెలిస్కోప్లు, రాకెట్ సిద్ధం కానున్నాయి. పాలపుంతలోని ఇతర సౌర కుటుంబాల్లో ఈ మిషన్ గ్రహాల వేటను కొనసాగిస్తుంది.
నాసాకు చెందిన కెప్లర్ టెలిస్కోప్ కంటే దాదాపు 1,015 రెట్లు ఎక్కువ శక్తిమంతమైన ఏడు టెలిస్కోప్లు ఈ మిషన్లో వినియోగించనున్నారు. లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏదేని నక్షత్రం ముందు నుంచి ఒక గ్రహం ప్రయాణించినప్పుడు ఆ నక్షత్ర ప్రకాశంలో ఏర్పడే అ త్యంత సూక్ష్మ మార్పులను మిషన్లోని 6 టెలిస్కోప్లు అత్యంత కచ్చితత్వంతో కనిపెడతాయి. విశ్వాంతరాళంలో 500 చదరపు డిగ్రీల పరిధిలో 12 లక్షల నక్షత్రాల ను (సౌరకుటుంబాలు) జల్లెడ పట్టడం వీటి విధి. వేరే సౌర కుటుంబాల్లోని నక్షత్రాలకు సుదూరంగా పరిభ్రమించే గ్రహా ల వివరాలను ఏడో టెలిస్కోప్ సేకరిస్తుం ది. దీనికోసం గ్రావిటేషనల్ మైక్రోలెన్సిం గ్ సాంకేతికతను వినియోగిస్తుంది. సేకరించిన డాటాను విశ్లేషించినివాసానికి అనువైన గ్రహాల జాబితా సిద్ధం చేస్తారు.