డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 18 ఏండ్ల వయసు పైబడిన వారిఇక టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రచారాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ సోమవారం ప్రారంభించారు. రాజధాని నగరం డెహ్రాడూన్లోని హరిద్వార్ బైపాస్ రోడ్లో ఉన్న రాధా స్వామి సత్సంగ్ న్యాస్ వద్ద 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మూడో రౌండ్ టీకాల ప్రచారం ప్రారంభించామని, దీని కింద రాష్ట్రంలోని 50 లక్షల మంది యువతకు కొవిడ్ టీకాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ తెలిపారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ప్రజలకు మొదటిసారి ఉచిత టీకాలు వేసినట్లు ప్రకటించిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్. దీని కోసం రూ.400 కోట్ల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నది.
ప్రతి పంచాయతీ స్థాయికి కూడా కొవిడ్ టీకా ప్రచారాన్ని తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ అన్నారు. వృద్ధులు, దివ్యంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీకాలు వేయడానికి అన్ని బూత్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఇలాఉండగా, టీకాలు వేసుకున్న తర్వాత కూడా కొవిడ్ ప్రొటోకాల్ పాటించాలని, ముక్కుకు మాస్క్ ధరంచడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటివి తప్పనిసరిగా అనుసరించాలని ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేశారు.
అప్పట్లో అమ్మతో ఇప్పటి బిలియనీర్.. ఎవరో తెలుసా..?
ప్రైవసీ పాలసీని గడువు వాయిదా వేసుకున్న వాట్సాప్.. ఎందుకో తెలుసా..?
అమెరికా చమురు పైప్లైన్పై సైబర్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన
మాడ్రిడ్ ఓపెన్ : రెండోసారి టైటిల్ గెల్చుకున్న జ్వెరెవ్
దక్షిణాఫ్రికా దేశాధ్యక్ష పీఠంపై నెల్సన్ మండేలా.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల 1 నుంచి నిలిచిపోనున్న గూగుల్ ఉచిత సేవలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..