Sunday |గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఆదివారం చికెన్, మటన్ షాపులు బంద్ పాటించనున్నాయి. రేపు ( ఏప్రిల్ 21 )న మహావీర్ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కబేళాలు, మాంసం దుకాణాలను బంద్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఈ ఆదేశాలు అతిక్రమించి చికెన్, మటన్ షాపులను తెరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో మున్సిపల్ సిబ్బందికి కావాల్సిన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. తిరిగి సోమవారం నుంచి యథావిధిగా కబేళాలు తెరుచుకోవచ్చని తెలిపారు.
మహవీర్ జయంతిని జైనులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. వాళ్లు ఎలాంటి జీవ హింస గానీ, మాంసాహారం తినడం కానీ చేయరు. అందుకే జైనుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ మహవీర్ జయంతి రోజున మాంసం దుకాణాలు బంద్ చేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.