టీమిండియా నయా వాల్ ఛటేశ్వర్ పుజారా ఇంగ్లండ్ లో సారథిగా నియమితుడయ్యాడు. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు ముందే అక్కడికి వెళ్లిన పుజారా.. రీషెడ్యూల్డ్ టెస్టు ముగిశాక కూడా అక్కడే ఉన్నాడు. ఇంగ్లీష్ గడ్డ మీద కౌంటీలు ఆడుతున్న పుజారా.. ప్రస్తుతం Sussex తరఫున బరిలోకి దిగుతున్నాడు. కాగా ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ టామ్ హేన్స్ కు గాయం కావడంతో ససెక్స్ కు పుజారా తాత్కాలిక సారథిగా నియమితుడయ్యాడు.
కౌంటీలలో భాగంగా నేటి నుంచి ససెక్స్ జట్టు.. Middlesex తో లార్డ్స్ వేదికగా మ్యాచ్ ఆడనుంది. అయితే గతవారం లీస్టర్షైర్ తో మ్యాచ్ ఆడుతూ హేన్స్ గాయపడటంతో పుజారాకు ఈ అవకాశం దక్కింది.
ఇదే విషయమై ససెక్స్ హెడ్ కోచ్ ఇయాన్ సలిస్బురి మాట్లాడుతూ.. పుజారాలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాడు. టామ్ హేన్స్ లేని లోటును అతడు భర్తీ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో పుజారా అనుభవం తమ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇయాన్ తెలిపాడు.
ఈ సీజన్ లో పుజారా ససెక్స్ తరఫున అదిరిపోయే ప్రదర్శనలు చేస్తున్నాడు. సమ్మర్ సీజన్ లో ససెక్స్ కు ఆరు మ్యాచులు ఆడిన పుజారా.. 110 సగటుతో 766 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు (ఒక డబుల్ సెంచరీ కూడా) ఉన్నాయి. ఈ సీజన్ లో షాన్ మసూద్ (1,074), వేన్ మ్యాడ్సెన్ (875) తర్వాత పుజారా అత్యధిక స్కోర్లు చేసిన బ్యాటర్లలో మూడో స్థానంలో నిలిచాడు.
Following the news of Tom Haines’ injury, Cheteshwar Pujara has been named as interim captain. ©
Good luck to @cheteshwar1 and the team. 👏 #GOSBTS
— Sussex Cricket (@SussexCCC) July 19, 2022