సియోని (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లో 16 ఏండ్ల బాలికపై చిరుత దాడి చేసింది. గొంతు కొరుకడంతో ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శనివారం సియోని జిల్లాలోని కన్హివాడా అటవీప్రాంతంలో చోటుచేసుకుంది. పశువుల మేత కోసం బాలిక, ఆమె తండ్రి అడవిలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఓ చిరుత ఒక్కసారిగా బాలికపై దాడి చేసింది. దీంతో దాన్ని తరిమికొట్టడానికి ఆ తండ్రి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.