హైదరాబాద్, ఆట ప్రతినిధి: కల్వకుంట్ల కవిత టీ20 (కేకేఆర్) కప్ను ఆర్సీసీ ఎలెవన్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీసీ జట్టు 19 పరుగుల తేడాతో రెయోలినా చాంపియన్స్పై విజయం సాధించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం (మార్చి 13) సందర్భంగా నిర్వహించిన కేకేఆర్ కప్ టీ20 టోర్నీ ఫైనల్లో తొలుత ఆర్సీసీ 17.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనలో రెయోలినా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 117 పరుగులకు పరిమితమైంది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కవితమ్మ ఆదర్శ నాయకురాలు, ఉత్తమ పార్లమెంటేరియన్గా పేరు తెచ్చుకున్నారు. ఆమె వందేండ్లు ఆరోగ్యంతో ప్రజా జీవితంలో ఉండాలి. మరెన్నో పదవులు చేపట్టాలి’ అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్, రాజీవ్ సాగర్, ముఠా జైసింహా, చింత శ్రీకుమార్ తదితరులు పాల్గొన్నారు.