న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు కనీసం 60 శాతం సీట్లపై ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదంటూ జారీచేసిన ఆదేశాల్ని కేంద్రం నిలిపివేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్, ఆకాశ ఎయిర్ నుంచి వచ్చిన అభ్యర్థలను పరిగణనలోకి తీసుకొని, మార్చి 17 నాటి ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్టు పేర్కొన్నది.
నిర్వహణ పరంగా, వాణిజ్యపరంగా సవాళ్లు ఎదురుకానున్నాయని ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రావాల్సిన ఉచిత సీట్ల ఉత్తర్వును నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వుకు ముందు 20 శాతం సీట్లు ఉచితంగా బుక్ చేసుకోవచ్చు.