హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మకు కేంద్రం నిధులివ్వాలని టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన కేంద్ర పర్యాట క శాఖ మంత్రి కిషన్రెడ్డికి లేఖ రాశారు. మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తిస్తే విశ్వవ్యాప్తమవుతుందని, ఇచ్చిన హామీ మేరకు వెంటనే ప్రకటించాలన్నా రు. ఫిబ్రవరి 16 నుంచి 19 తేదీల్లో జరిగే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్లు విడుదల చేసిందని, కేంద్రం నుంచి నిధులొస్తే వైభవంగా నిర్వహించవచ్చన్నారు.