కోహెడ, డిసెంబర్ 12: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల పాలిట శాపం గా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా కోహెడలోని పార్టీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. వ్యవసాయంపై నల్ల చట్టాలను తీసుకొచ్చి 750 మందికిపైగా రైతుల ఉసురు తీసిందన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఓ వైపు తెలంగాణ రైతులకు హామీ ఇస్తుండగా, మరో మం త్రి పియూష్ గోయల్ మాత్రం ధాన్యం తీసుకునేది లేదని స్పష్టంచేస్తున్నారని తెలిపారు.
కేంద్రం ఇలా రెండు నాలుకల ధోరణి అవలంబిస్తూ రాష్ట్ర రైతుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నదని మండిపడ్డారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని, యాసంగిలో పంట వేసుకునేలా చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. లేకుంటే సీపీఐతోపాటు మరిన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.