శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఎన్నికల కోసం జమ్ముకశ్మీర్ పార్టీలతో చర్చలకు ఏర్పాట్లు ప్రారంభించింది. గుప్కర్ కూడా ప్రభుత్వంతో చర్చించేందుకు తమ సంసిద్ధత తెలిపినట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటివరకు ఎవ్వరికి కూడా అధికారిక ఆహ్వానం అందలేదు. అయితే, అమెరికా ఒత్తిళ్ల మేరకే భారత్ చర్చలకు తెరలేపినట్లుగా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పీడీపీతో పొత్తును విరమించుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించిన తర్వాత 2018 జూన్లో జమ్ముకశ్మీర్లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. అప్పటి నుంచి ఇక్కడ ఎన్నికలకు సంబంధించి రాజకీయ ప్రకంపనలేవీ లేవు. 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లడఖ్.. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన పలువురు నాయకులను హౌజ్ అరెస్ట్లో ఉంచారు. కొంతకాలం తర్వాత గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిపారు. ఇన్నిరోజుల తర్వాత తిరిగి ఎన్నికల ఊసెత్తడంతో రాజకీయ పార్టీల్లో ఉత్సాహం మొదలైంది. కేంద్రం చేపట్టే చర్చల్లో చేరేందుకు పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్తోపాటు ఏడు పార్టీల గుప్కర్ సంసిద్ధత తెలిపినట్లు తెలుస్తున్నది. డీలిమిటేషన్కు సంబంధించిన చర్చల్లో పాల్గొంటామని గుప్కర్ నాయకులు తెలిపారు.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం గురించి ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఎన్నికల సంఘం ఇక్కడ ఎన్నికలు నిర్వహించడాన్ని తిరస్కరించింది. కశ్మీర్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని భారత్పై అమెరికా ఒత్తిడి తెచ్చిన తరుణంలో ఈ ఎన్నికల చర్చలకు కేంద్రం ముందుకొచ్చినట్లు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అందుకు అనుగుణంగానే కశ్మీర్లోని వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
చాలా ఆరుదు : తవ్వకాల్లో దొరికిన 1000 ఏండ్ల నాటి కోడిగుడ్డు
రాజకీయ రంగు : త్వరలో బ్రాహ్మణేతర పూజరుల నియామకం
75 ఏండ్ల కానుక : త్వరలో కనీస వయసులో మార్పులు..!
చరిత్రలో ఈరోజు : ఉపహార్ అగ్నిప్రమాదంలో 59 మంది మృతి
యూపీ విభజన : యోగీ ఢిల్లీ పర్యటన అందుకేనా..?
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
హార్ట్ రిథమ్ : కరోనా కారణంగా అరిథ్మియాకు అవకాశాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..