Cellbay : తెలంగాణ రాష్ట్రంలో మరో సెల్బే షోరూమ్ ప్రారంభమైంది. తెలంగాణకు చెందిన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్ సెల్బే యజమాన్యం.. ఈ రోజు తూప్రాన్ పట్టణంలో కొత్త షోరూమ్ను ప్రారంభించింది. ఈ షోరూమ్లో మొబైల్ హ్యాండ్సెట్లు, ఉపకరణాలు, స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు తదితర ఉత్పత్తులు లభిస్తాయి. ప్రజలు తమ షోరూమ్కు వచ్చి ప్రారంభ ఆఫర్లను పొందాలని షోరూమ్ నిర్వాహకులు కోరారు.
సెల్బే కంపెనీ తన సేవలను దక్షిణ భారతదేశంలోని మూలమూలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందుకే 3 టైర్ నగరాల్లోకి ప్రవేశించడం ప్రారంభించిందని శ్రీ సోమ చెప్పారు. సెల్బే తన కస్టమర్లను చేరుకోవడంలో సెల్బే పాత్ర గురించి, ఎప్పటికప్పుడు మెరుగైన రీతిలో సేవలను విస్తరించడం గురించి శ్రీ సుహాస్ నల్లచెరు వివరించారు.సెల్బేలో అన్ని ఉత్పత్తులు న్యాయమైన ధరలకే లభిస్తాయని గర్వంగా చెప్పారు.
సెల్బే మార్కెటింగ్ డైరెక్టర్ సుదీప్ నల్లచెరు మాట్లాడుతూ కస్టమర్ కొనుగోలు విధానం కొత్త పోకడలను అనుసరిస్తుందని వారికీ అనుగుణంగా తమ మార్కెటింగ్ స్ట్రాటజీని మలుచుకుంటున్నామని చెప్పారు. అందులో భాగంగా సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ పద్ధతులు అనుసరిస్తున్నామని చెప్పారు . కార్యక్రమం లో Vivo జనరల్ మేనేజర్ శ్రీ అతీష్ భార్గవ్, జియోమీ ఏపీ, తెలంగాణ హెడ్ అన్వర్, ఫైనాన్స్ సంస్థ అధికారులు, CELLBAY టీమ్ సభ్యులు, బ్రాండ్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.