యాదాద్రి, నవంబర్ 1: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు పాతగుట్ట అనుబంధ ఆలయంలో ఈ నెల 5 నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించనున్నట్టు ఈవో గీత తెలిపారు. సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రతినిత్యం ఆరు వ్రత బ్యాచ్లను కొండకింద పాత గోశాల ఆవరణలో ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.