న్యూఢిల్లీ, నవంబర్ 26: అవినీతి కేసులో అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాను విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అనుమతి లభించింది. సరైన మౌలిక సదుపాయాలు లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం 2017లో పలు మెడికల్ కాలేజీలకు కొత్త అడ్మిషన్లను నిలిపేసింది. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే ప్రైవేటు మెడికల్ కాలేజీకి అనుకూలంగా ఉత్తర్వులు జారీచేశారన్న ఆరోపణలు జడ్జిపై ఉన్నాయి.