న్యూఢిల్లీ: ఆపరేషన్ మేఘచక్రలో భాగంగా ఇవాళ సీబీఐ 56 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించింది. చైల్డ్ పోర్నోగ్రఫీతో లింకు ఉన్న రెండు కేసుల్లో ఆ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 19 రాష్ట్రాలు, యూటీల్లో ఈ తనిఖీలు సాగుతున్నాయి. గత ఏడాది ఆపరేషన్ కార్బన్లో భాగంగా ఇంటర్పోల్ సింగపూర్, ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు జరుగుతున్నాయి. క్లౌడ్ స్టోరేజ్ నుంచి పెడ్లింగ్కు పాల్పడుతున్నవారిపై సీబీఐ దృష్టి పెట్టింది. మైనర్ల లైంగిక దాడికి సంబంధించిన వీడియోలను పెడ్లర్లు క్లౌడ్ స్టోరేజీల్లో దాచి సర్క్యూలేట్ చేస్తున్నట్లు ఆరోపనలు ఉన్నాయి. చైల్డ్ పోర్నోగ్రఫీ కాంటెంట్ను సర్క్యులేట్ చేస్తున్న గ్యాంగ్ సభ్యులపై దాడి చేశారు.