జనగామ : జిల్లాలోని తరిగొప్పుల మండలం పోతారం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ శివ లింగయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన రహదారులను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. గ్రామంలో జరుగుతున్న హరితహారం పనుల గురించి పని ప్రదేశంలో కూలీలను వివరాలు తెలుసుకున్నారు. హరితహారం మొక్కలు అన్ని బతికేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.