జమ్మికుంట రూరల్ : కారు కేసీఆర్ నినాదాన్ని బలపరిచి, ఉద్యమ నిరుపేద విద్యార్ధి నాయకున్ని ఆశీర్వదించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. గురువారం పట్టణంలోని 29, 30 వార్డుల్లో మంత్రి ప్రచారం నిర్వహించారు. పాత కూరగాయల మార్కెట్, బొమ్మలగుడి ప్రాంతాల్లో మంత్రి కాలినడకన తిరుగుతూ కేసీఆర్ సంక్షేమ పథకాలను ఇంటింట ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించాలని ఓట్లను అభ్యర్ధించారు.
ఆనంతరం మోడల్ ఈవిఎంను చేత పట్టుకుని 2వ నంబర్ టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారుగర్తు పై వేలును ఉంచి ఓటేలా వేయాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ….కారులను పోలిన రోడ్డు రోలర్, రోట్టె పీట గుర్తులు కూడా ఉన్నాయని చెప్పారు. వృద్దులు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని తెలిపారు. జాగ్రత్తగా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు టంగుటూరి రాజ్కుమార్ వార్డు కౌన్సిలర్లు మద్దిలావణ్య, రావికంటి రాజు, నాయకులు శ్రీనివాస్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.