వేములవాడ, మార్చి 1: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నిలిపి ఉంచిన కారు ప్రమాదవశాత్తు దగ్ధమైంది. స్థానిక కేదారేశ్వర స్వామివారి ఆలయ సమీపంలో నివాసం ఉండే శ్యామ శ్రీనివాస్ మంగళవారం తన ఇండికా కారును ఖాళీ స్థలంలో నిలిపి ఉంచాడు. సాయంత్రం ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వెంటనే వచ్చి మంటలు అదుపుచేశారు. కారు పూర్తిగా దగ్ధమైంది.