న్యూఢిల్లీ: మన దేశంలో క్యాన్సర్కు గురవుతున్న యువత సంఖ్య పెరుగుతున్నది. కొందరు ఆంకాలజిస్టులు ఏర్పాటు చేసిన క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. క్యాన్సర్పై సెకండ్ ఒపీనియన్ కోసం ఈ సంస్థ హెల్ప్లైన్ నంబరు 9355520202ను ఏర్పాటుచేసింది. ఈ నంబర్కు కాల్ చేసిన క్యాన్సర్ బాధితుల్లో 40 ఏండ్లులోపు వారు 20 శాతం ఉన్నారు. మార్చి 1 నుంచి మే 15 వరకు 1,368 కాల్స్ వచ్చినట్లు ఈ సంస్థ వెల్లడించింది. 40 ఏండ్ల లోపు వయసుగల క్యాన్సర్ రోగుల్లో 60 శాతం మంది పురుషులేనని వెల్లడించింది. క్యాన్సర్ రోగులు హెల్ప్లైన్ నంబరు 9355520202కు ఫోన్ చేసి, ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేకుండానే, సెకండ్ ఒపీనియన్ను పొందడానికి ఈ సంస్థ అవకాశం కల్పించింది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి, సెకండ్ ఒపీనియన్ను పొందవచ్చు. అనుభవజ్ఞులైన ఆకాంలజిస్టులతో నేరుగా మాట్లాడవచ్చు లేదా వీడియో కాల్ చేసి, క్యాన్సర్ చికిత్స గురించి చర్చించవచ్చు.
ఎక్కడ నుంచి ఎక్కువ కాల్స్?
హైదరాబాద్, మీరట్, ముంబై, న్యూఢిల్లీ