న్యూఢిల్లీ : గురుగ్రాంలో దారుణ ఘటన వెలుగుచూసింది. నగరంలోని జనసమ్మర్ధ ప్రాంతమైన సొహ్న మార్కెట్లో శుక్రవారం బైక్పై వచ్చిన దుండగులు వ్యాపారిపై కాల్పులు జరిపారు. వ్యాపారి నగరంలోని సదర్ బజార్ ప్రాంతంలో దుకాణం నడుపుతున్నారు.
దుండగులు వ్యాపారిపై కాల్పులు జరపగా బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్ధలానికి చేరుకున్న గురుగ్రాం పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుట్జ్ను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.