ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 29: రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) దిష్టిబొమ్మను ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థి నాయకులు సోమవారం దహనం(Burning effigy) చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ..ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విధానాలను అవలంబిస్తున్నాయని మండిపడ్డారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తూ మోదీ, అమిత్షాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు వెంకట్ నాయక్, వలిగొండ నరసింహ, ఈశ్వర్, అజయ్, రఫీ తదితరులు పాల్గొన్నారు.