శంషాబాద్:ఓ ప్రయాణీకుడి వద్ద బుల్లెట్ పట్టుబడి కలకలం రేపిన ఘటన గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికార వర్గాల వివరాల ప్రకారం….హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్లేందుకు ఓ ప్రయాణీకుడు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చాడు. ఎయిర్పోర్టు లో సిఐఎస్ఎఫ్ తనిఖీలో బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్ స్వాధీనం చేసుకొని అతనిని శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలలో భాగంగా ఈ నెల 30 వరకు ఎయిర్పోర్టులో హైఅలర్ట్ ప్రకటించారు.