న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: బీఎస్ఈలో లిైస్టెన సంస్థల నికర విలువ రికార్డు స్థాయికి చేరుకున్నది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.283 లక్షల కోట్లకు చేరుకున్నది. బీఎస్ఈ చరిత్రలో ఇంతటి గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. వరుసగా రెండు రోజులుగా లాభపడుతున్న 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ శుక్రవారం 104.92 పాయింట్లు అందుకొని 59,793.13 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 60 వేల పాయింట్లను తచ్చాడిన సూచీ చివరకు ఈ భారీ లాభాలను నిలుపుకోలేకపోయింది. వరుస రెండు రోజుల్లో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.2,16,603.93 కోట్లు పెరిగి రికార్డు స్థాయి రూ.2,83,03,925.62 కోట్ల స్థాయికి ఎగబాకింది.
మరోవైపు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 35 పాయింట్లు ఎగబాకి 17,833 పాయింట్లకు చేరుకున్నది. దేశీయ ఆర్థిక పరిస్థితులపై పెట్టుబడిదారులు నమ్మకం ఉండటంతో సూచీ మళ్లీ 60 వేల మార్క్ను అధిగమించిందని కొటక్ సెక్యూరిటీ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ అమోల్ ఆథావాలే తెలిపారు. వారాంతం ట్రేడింగ్ మార్కెట్లో టెక్ మహీంద్రా మూడు శాతానికి పైగా పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. దీంతోపాటు ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, మారుతి, ఎస్బీఐ, టీసీఎస్, విప్రో, యాక్సిస్ బ్యాంక్లు లాభాల్లో ముగిశాయి. కానీ, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్ అండ్ టుబ్రో, బజాజ్ ఫైనాన్స్లు నష్టాల్లో ముగిశాయి.