మేడ్చల్ మల్కాజిగిరి : ఈత రాని ఓ యువకుడిని తోటి మిత్రులు నీటి గుంతలోకి తోయటంతో నీట మునిగి మృతి చెందాడు. ఈ అమానవీయ సంఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి కొండాపూర్లో చోటు చేసుకుంది.
ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎన్. చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..ఘట్కేసర్ మున్సిపాలిటీ బాలాజీనగర్కు చెందిన బండారి మల్లయ్య కుమారుడు శ్రీను(25) తన మిత్రులు దమ్మాయిగూడకు చెందిన బండారి పోచయ్య, బాలాజీనగర్కు చెందిన ఒంటెద్దు గోపి(20)లతో కలిసి కొండాపూర్లోని కూలర్ కంపెనీ సమీపంలోని నీటి గుంతలోకి ఈత కొట్టేందుకు వెళ్లారు.
ముందుగా పోచయ్య, గోపి నీటి గుంతలోకి దిగి ఈత కొడుతూ శ్రీనుకు ఈత రాదని తెలిసినప్పటికి నీటి గుంతలోకి తోశారు. దీంతో ఈత రాని శ్రీను నీటిలో నుంచి పైకి రాకుండా మునిగి పోయాడు. ఎంత ప్రయత్నించినప్పటికి శ్రీను పైకి రాకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి నీటి గుంతలో వెతుకుతున్నారు. ఈత రాదని తెలిసినప్పటికి నీటిలో తోసేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కొండపోచమ్మ సాగర్ అద్భుతంగా ఉంది
భక్తులతో కిక్కిరిసిన ‘మల్లన్న’ క్షేత్రం
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి : మంత్రులు
జొన్నకుప్ప దగ్ధం.. రూ.45వేల నష్టం
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
లారీని ఢీకొట్టిన కారు..వ్యక్తి మృతి
నిజామాబాద్లో వృద్ధ దంపతుల ఆత్మహత్య