కేపీహెచ్బీకాలనీ, ఏప్రిల్ 29: కూకట్పల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం హనుమంతుడు, గరుత్మంతుడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, చామకూర మల్లారెడ్డి, వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అలాగే గురువారం హనుమంతుడు, గరుత్మంతుడి స్వామి విరాట్మూర్తులకు మహా కుంభప్రోక్షణ పూజలు ఉంటాయని, అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయం మాజీ చైర్మన్ నాయినేని శ్రీనివాస్రావు, నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ ఆరోరా, మాజీ కార్పొరేటర్లు రోజాదేవి, రంగారావు, ముద్దం నర్సింహయాదవ్, ఆవుల రవీందర్రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, తూము శ్రావణ్కుమార్, పండాల సతీశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.