మల్కాజిగిరి, నవంబర్ 25: రైల్వే చక్రబంధం నుంచి ప్రజలకు విముక్తి కల్పించడం కోసం రైల్వేగేట్ల వద్ద ఆర్యూబీలను నిర్మిస్తామని మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల పరిధిలో ఆయన ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. అలాగే.. పలు ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరి సర్కిల్లోని వాజ్పేయినగర్, ఉత్తంనగర్, కాకతీయనగర్, ఉప్పరిగూడ, అల్వాల్ సర్కిల్ పరిధిలోని బొల్లారం వద్ద ఉన్న రైల్వే గేట్ల వద్ద ఆర్యూబీలు, ఆర్ఓబీలను నిర్మిస్తామని హామీ ఇస్తున్నానని అన్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆనంద్బాగ్, ఉత్తంనగర్ ఆర్యూబీలు, వెస్ట్ వెంకటాపురంలోని కల్వర్డ్ వద్ద బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి చేశామని అన్నారు. చరిత్రక మౌలాలి కమాన్కు నష్టంకాకుండా రోడ్డును విస్తరించామని, స్థలాలు కోల్పొయిన వారికి నష్టపరిహారం చెల్లించామని అన్నారు.
ఓల్డ్ మల్కాజిగిరి పటేల్నగర్ నుంచి తార్నాక వైపు వాహనాలు వెళ్లడానికి రోడ్డు ను విస్తరిస్తామని, రైల్వే అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. సఫిల్గూ డ వద్ద ఉన్న రైల్వే గేటును మూసి వేయడంతో దాదాపు 10 కాలనీల ప్రజ లు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామని, ఎన్నికల తర్వాత మొదటి ప్రాధాన్యతగా రైల్వే గేటును తెరిపించడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని, కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని అన్నారు.
మల్కాజిగిరిలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, మర్రి లక్ష్మణ్రెడ్డి, మర్రి మమతారెడ్డి, కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, మురుగేశ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, సర్కిల్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, నాయకులు బద్దం పరశురాంరెడ్డి, ఉపేందర్రెడ్డి, సురేశ్యాదవ్, శ్రీనివాస్గౌడ్, డోలీ రమే శ్, జీకే హన్మంతరావు, అమీనుద్దీన్, భాగ్యనందరావు, నేమూరి శ్రీధర్గౌడ్, పుదారి రాజేష్కన్న, సయ్యద్ మోసిన్, చిన్నయాదవ్, నిర్మలారెడ్డి పాల్గొన్నారు.