వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సంగారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరిస్తున్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై గెలుపుపై వ్యూహరచనలు చేస్తుండడంతో పాటు మేధావులు, విద్యావంతులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. కులమతాలకతీతంగా అన్ని వర్గాలూ అండగా నిలుస్తామని హామీ ఇస్తున్నాయి. ఇటీవల సంగారెడ్డిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన రేషన్ డీలర్లు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. సీఎం కేసీఆర్ పాలనను ఆకర్షితులవుతున్న వందలాది మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు చింతా సమక్షంలో గులాబీ కండువాకప్పుకుంటుండగా, బీఆర్ఎస్ శ్రేణులు నూతనోత్సాహంతో ఎలక్షన్ ఫైట్కు సిద్ధమవుతున్నారు.
సంగారెడ్డి అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి నియోజక వర్గ బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ జనంలో మమేకమవుతున్నారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్రావు సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ పేరును ప్రకటించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది మొదలు చింతా ప్రభాకర్ ప్రజల్లో ఉంటూ అన్ని వర్గాల మద్దతు కూడగడుతున్నారు. సీఎం కేసీఆర్, ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచనల మేరకు ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ నియోజకవర్గంలోని ప్రజలతోపాటు మేధావులు, విద్యావంతులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను కలిసి మద్దతు కూడగడుతున్నా రు. అలాగే నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాల పెద్దలను కలుస్తున్నారు. ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించాలని ప్రతిఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా చింతా ప్రభాకర్కు మద్దతు ఇస్తున్నారు. ఇటీవల సమావేశమైన రేషన్ డీలర్లు తమ మద్దతు బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్కు ఉం టుందని ప్రకటించారు. ఈమేరకు సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి చింతా ప్రభాకర్కు అందజేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, విశ్రాంత ఉద్యోగులు సైతం తమ మద్దతును ప్రకటిస్తున్నారు. విభిన్న సామాజిక వర్గాల ప్రజలు చింతా ప్రభాకర్ వెన్నంటే నడుస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు సైతం చింతాకు అండగా నిలుస్తున్నారు.
సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ ఎన్నడూ ప్రజలకు దూరంకాలేదు. సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓటమి పాలైనప్పటికీ చింతా ప్రభాకర్ జనంలోనే ఉన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జగ్గారెడ్డి ప్రజలకు అందుబాటులో లేకుండాపోయారు. కనీసం ఫోన్లో కూడా చిక్కని పరిస్థితి. అయితే చింతా ప్రభాకర్ మాత్రం సదాశివపేటలోని తన నివాసం, సంగారెడ్డిలోని తన కార్యాలయంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి పెద్దపీట వేశారు. కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచారు. కరోనా బారిన పడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందేలా చూసి ప్రజల ప్రాణాలు కాపాడారు. సీఎం రిలీఫ్ఫండ్ డబ్బులు ఇప్పిం చి పేద రోగులకు అండగా నిలిచారు. చింతా ప్రభాకర్కు ఫోన్ చేస్తే చాలు సమస్య పరిష్కారమవుతుందన్న పేరు తెచ్చుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకున్న అనంతరం తిరిగి ప్రజాసేవలో మునిగిపోయారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారంతో సంగారెడ్డి నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టా రు. పేదలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేశారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సంగారెడ్డికి మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను సాధించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం చింతా ప్రభాకర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నియోకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తూ మద్దతు కూడగడుతున్నారు. పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజలకు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రజా మద్దతుతో ఎన్నికల్లో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ పార్టీ శ్రేణుల్లో సైతం ఉత్సాహాన్ని నింపుతున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసేలా ముందుకునడిపిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, మండల పార్టీ నాయకులతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. నియోజకవర్గ స్థాయి నాయకులు మొదలు కార్యకర్తలకు వరకు అందరూ సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. బూతు స్థాయి కమిటీలను వేసి వారితో వరుసగా సమావేశమవుతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కేడర్ పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలో చేరికలపైన చింతా ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇటీవల నియోజకవర్గంలోని కాంగ్రెస్, బీజేపీల నుంచి నాయకులు పెద్ద సం ఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. త్వరలోనే కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్యనేతలు కొంతమంది బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. చింతా ప్రబాకర్ మిగతా పార్టీలకంటే ముందుగానే గెలుపు వ్యూహాలకు పదునుపెడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.