నవంబర్ 18 : ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందించే బీఆర్ఎస్ పార్టీని ఆదరించి మరోసారి అవకాశం ఇచ్చి అభివృద్ధి చేసుకుందామని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునితామహేందర్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని కులకచర్ల, చాపలగూడెం, తిర్మలాపూర్, లాల్సింగ్తండా, బండమీదితండా, ఇప్పాయిపల్లి, రాంపూర్,చెరువుముందలితండా(ఎ), కుస్మసముద్రం, చెరువుముందలితండా(కె), గోరిగడ్డతండా, అనంతసాగర్, పుట్టపహాడ్ గ్రామాల్లో బీఆర్ఎస్ కులకచర్ల మండల అధ్యక్షుడు సేరి రాంరెడ్డి అధ్యక్షతన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నదన్నారు. కారుగుర్తుకు ఓటు వేసి మరోసారి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి నిరూపించిన బీఆర్ఎస్కు మరోసారి అవకాశం కల్పించాలని, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
పరిగి ఎమ్మెల్యేగా మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు.
శనివారం కులకచర్ల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో గ్రామా ల్లో సమస్యలు ఉండేవని నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, మారుమూల తండాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తనను మరోసారి భారీ మెజార్టీటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కులకచర్లలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషిచేస్తానని, గ్రామాల్లో మహిళా సంఘాలకు సొంత భవనాలను మంజూరు చేస్తామని తెలిపారు.
కులకచర్ల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రచారానికి మంచి స్పందన లభించింది. గ్రామాల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభ్యర్థికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కులకచర్ల మండల అధ్యక్షుడు రాంరెడ్డి, జడ్పీటీసీ రాందాస్నాయక్, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, మండల మాజీ అధ్యక్షుడు సారా శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాజప్ప, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు జుబేర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సునంద బుగ్గన్న యాదవ్, ఉద్యమ కారుడు రామన్నమాదిగ, మహేశ్వరం రాములు, సత్యనారాయణ, రవినాయక్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శంకర్నాయక్, నర్సింహులు, లక్ష్మయ్య, బాలయ్య, బిచ్చయ్య, అంజిలయ్య, ఇప్పాయిపల్లి ఎంపీటీసీ పద్మారఘుగౌడ్, మాజీ ఎంపీటీసీ సంధ్యానంద్, వైస్ ఎంపీపీ రాజశేఖర్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.