Vekatram Reddy : తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా మే నెల 13న పోలింగ్ జరగనుండటంతో.. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెల 18 మొదలైన నామినేషన్లకు రేపటితో గడువు ముగియనుంది. గడువు ఒక్కరోజే ఉండటంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతున్నాయి.
ఇవాళ మెదక్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి సెట్ 1 నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్రాంరెడ్డి వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, బీఆర్ఎస్ నేత పుష్ప నాగేష్ యాదవ్ ఉన్నారు.