ఫిబ్రవరి 19 : మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండల వ్యాప్తంగా సంపూర్ణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. దుకాణ సముదాయాలు, ఇతర వ్యాపారులు స్వచ్చంధంగా బంద్లో పాల్గొన్నారు. విద్యాసంస్థలను బంద్ చేయించారు. ప్రశాంతంగా, శాంతియుతంగా బంద్ కొనసాగుతున్నది.
ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, అన్యాయ అరెస్టుకు వ్యతిరేకంగా చేపడుతున్న బంద్కు ప్రజలు స్వచ్చంధంగా సహకరిస్తున్నారని, ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కాసిపేట గ్రామ అధ్యక్షులు అగ్గి సత్తయ్య, నిచ్చకోళ్ల శంకర్, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు మారం మహేందర్, మోటూరి వేణు, అక్కపెల్లి శ్రీనివాస్, సత్రవేణి మల్లేష్, బన్న శ్రీనివాస్, ఉదయ్, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.