తిరుమల,జూన్ 30:దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. “నందమూరి బాలకృష్ణతో తెరకెక్కిస్తున్న‘అఖండ’ క్లైమాక్స్ షూటింగ్ లొకేషన్ల కోసం ప్లాన్ చేస్తున్నట్లు బోయపాటి శ్రీను తెలిపారు. కడపలో లొకేషన్స్ వెతుకుతున్నట్లు చెప్పారు. కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తిని బట్టి ‘అఖండ’ సినిమా విడుదల తేదీని నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు.