హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం తట్టి అన్నారం గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కాలనీలో నీటి గుంతలోపడి అనిరుధ్ (10) అనే బాలుడు మృతి చెందాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హనుమాన్నగర్లో వరద నీరు నిలిచింది. కాలనీలో బాలుడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి.. ప్రమాదవశాత్తు ఆ నీటి గుంతలో పడిపోయాడు. చెట్ల పొదలను పట్టుకొని ఉన్న మరో బాలుడిని పోలీసులు రక్షించారు. అప్పటి వరకు ఆడుకుంటూ కండ్ల ముందే ఉన్న బిడ్డను కొద్ది క్షణాల్లోనే విగత జీవిగా మారడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.