వనస్థలిపురం, నవంబర్ 24: బోర్వెల్ లారీ ఢీకొట్టడంతో యాక్టివా బైక్పై వెళ్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జడ్చర్లకు చెందిన విశాల్(20), హబ్సిగూడకు చెందిన రోహిత్రెడ్డి(20), శ్రీపురం కాలనీలో నివాసముండే గౌతమ్రెడ్డి(20) సీవీఆర్ కళాశాలలో ఇంజినీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్నారు. బుధవారం కళాశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగివస్తుండగా శ్రీపురం కాలనీలో వారి యాక్టివా బైక్ (టీఎస్08జీవో3766)ను బోర్వెల్ లారీ(టీఎస్12ఈఎన్7299) అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న గౌతమ్రెడ్డి ఎగిరి దూరంగా పడిపోగా, వెనుక కూర్చున రోహిత్రెడ్డి, విశాల్ లారీ వెనుక టైర్ల కిందపడి మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.