కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాంగళ్య షాపింగ్ మాల్ బాంబు పెట్టామనే ఫేక్ ఫోన్ కాల్ కలకలం రేపింది. సోమవారం మధ్యాహ్నం షాపింగ్ మాల్ నిర్వాహకులకు గుర్తు తెలియని వ్యక్తులు అన్నోన్ నంబర్తో ఫోన్ చేసి మీ షాపింగ్ మాల్లో బాంబు పెట్టామని, ఐదు నిమిషాల్లో పేలి పోతుందని బెదిరించారు.
దీంతో కంగారు పడిన నిర్వాహకులు షాపింగ్ మాల్ స్పీకర్లలో అనౌన్స్ చేశారు. దీంతో నిత్యం కష్టమర్లతో కిటకిటలాడే షాపింగ్ మాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది.
కష్టమర్లు కంగారుగా మాల్ బయటకు పరుగులు తీశారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్ తో షాపింగ్ మాల్కు చేరుకుని అనువనువును గాలించారు. బాంబు ఆనవాళ్లు కనిపించక పోవడంతో ఇదంతా ఫేక్ అని తేల్చారు. దీంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.