ముంబై: బాలీవుడ్ మాజీ నటుడు అరుణ్ బాలీ(Arun Bali) కన్నుమూశారు. ఆయన వయసు 79 ఏళ్లు. గత కొన్నాళ్ల నుంచి ఆయన ఆరోగ్యం సరిగా లేదు. న్యూరోమస్క్యూలార్ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ముంబైలోని హిర్నందని హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు.
సూపర్ హిట్ ఫిల్మ్ త్రీ ఇడియట్స్లో అరుణ్ బాలీ నటించారు. ఇంకా కేదార్నాథ్, పానిపట్, హే రామ్, దండ్ నాయక్, రెడీ, జమీన్, పోలీస్వాలా గుండా, పూల్ ఔర్ అంగార్, రామ్ జానే లాంటి చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించారు.
1991లో ప్రసారం అయిన చాణక్య సిరీయల్లో కింగ్ పోరస్ పాత్రలో నటించారు. స్వాభిమాన్ సీరియల్లో కున్వార్ సింగ్ రోల్ ప్లే చేశారు. నిర్మాతగా ఆయన జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.