జమ్మికుంట: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిద్దామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామంలో సోమవారం ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వినోద్కుమార్తోపాటు ఎమ్మెల్యే అరూరి రమేశ్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు గ్రామస్తులు డప్పు చప్పుళ్లు, కోలాటాలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, బీజేపీకి ఓటేస్తే మోసపోతామన్నారు. అభివృద్ధే ఎజెండాగా ముందుకుపోతున్న టీఆర్ఎస్కు అండగా నిలువాలని కోరారు. వారి వెంట జడ్పీటీసీ శ్రీరాంశ్యాం, సర్పంచ్ అకేనపల్లి సుజాత భద్రయ్య, ఉప సర్పంచ్ లింగంపల్లి రవీందర్రావు, ఎంపీటీసీ సంపెళ్లి స్వరూప బీమారావు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దేవేందర్రావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళలు, యువత, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.