సిద్దిపేట, అక్టోబర్ 10 : హుస్నాబాద్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్కు ఎనలేని నమ్మకం ఉన్నదని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్(Boinapally Vinodkumar) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన హుస్నాబాద్లో నిర్వహిస్తున్న సభా ఏర్పాట్లను మంత్రి హరీశ్రావు, స్థానిక ఎమ్మెల్యే సతీశ్ బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ..ఇక్కడి ప్రజల ఆశీర్వాదం గొప్పదని భావించిన కేసీఆర్ మూడోసారి కూడా ఇక్కడే ఆశీర్వాద సభ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
లక్ష మందితో హుస్నాబాద్లో సభను నిర్వహించి సీఎం కేసీఆర్కు ప్రజల ఆశీర్వాదం అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషి, ఎమ్మెల్యే సతీశ్కుమార్ పట్టుదలతో హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందని, మరింత అభివృద్ధి జరగాలంటే అక్కడి సీఎం కేసీఆర్, మంత్రిగా హరీశ్రావు, ఎమ్మెల్యేగా సతీశ్కుమార్ ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. ప్రజాఆశీర్వాద సభను అనుకున్నదానికంటే ఎక్కువ జయప్రదం చేసి సీఎం కేసీఆర్కు ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని, ఇందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, సిద్దిపేట జడ్పీ వైస్చైర్మన్ రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఎంపీపీలు లకావత్ మానస, మాలోతు లక్ష్మి, కొత్త వినీత, అనిత, స్వప్న, ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీలు భూక్య మంగ, గీకురు రవీందర్, వంగ రవీందర్, మార్కెట్ చైర్పర్సన్ ఎడబోయిన రజనీతిరుపతిరెడ్డి, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మీ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, నాయకులు దేవేందర్రావు, వంగ వెంకట్రాంరెడ్డి, ఎండీ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.