ధర్మపురి(జగిత్యాల) : రైతులకు, యువతకు మేలు చేసేందుకు నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ(Ethanol Industry)ను కొందరు అడ్డుకుని ద్రోహం చేసేందుకు యత్నిస్తున్నారని కరీంనగర్ డీసీఎంఎస్ చైర్మన్(DCMS Chairman) డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. శనివారం ధర్మపురి ఎమ్మెల్యేక్యాంపు(Mla Camp Office) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వెనుకబడ్డ ధర్మపురి నియోజకవర్గ ప్రాంతం వెల్గటూర్ మండలం స్తంబంపల్లి గ్రామంలో క్రిబ్కో సహకార సంస్థ సహకారంతో ప్రభుత్వం నెలకొల్పనున్న ఇథనాల్ పరిశ్రమను డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్కుమార్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర పాలనలో అన్ని రంగాల్లో వెనుబడిన ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు లేక కేవలం రైస్మిల్లులు(Rice Mill) మాత్రమే ఉండి యువతకు ఉపాధి కరువైందన్నారు.
ఈ ప్రాంత రైతులకు మేలు చేయడంతో పాటు యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంలో మంత్రి ఈశ్వర్(Minister Eshwar) కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR) లను ఒప్పించి ఇథనాల్ పరిశ్రమను ధర్మపురి నియోజకవర్గానికి తీసుకువచ్చారన్నారు. ఇథనాల్ పరిశ్రమను క్రిబ్కో సంస్థ ద్వారా ఏర్పాటు చేసి దేశ రైతాంగానికి ప్రతీ ఏటా 45లక్షల టన్నుల యూరియా, 20లక్షల టన్నుల డీఏపీ ని అందజేయనున్నదని తెలిపారు.
ఈ సంస్థ భారతదేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లో ఇథనాల్ ప్రాజెక్టులు నిర్మించేందుకు ముందుకు వచ్చిందన్నారు. అందులో తెలంగాణ రాష్ట్రం ఒకటని వివరించారు. ఈ పరిశ్రమ ద్వారా 200 మంది యువకులకు పర్మినెంట్ ఉద్యోగాలు అవకాశాలు, మరో వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రతీ ఏటా 6లక్షల టన్నుల వరిధాన్యం, మొక్కజొన్నను రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తుందన్నారు. ప్రభుత్వ భూమిలో పరిశ్రమను నెలకొల్పితే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు.
ఇథనాల్ పరిశ్రమ వల్ల మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ సౌళ్ల భీమయ్య, పీఏసీఎస్ చైర్మన్ సౌళ్ల నరేశ్, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.