మల్లాపూర్, జనవరి 19 : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి బుధవారం మల్లాపూర్ డివిజన్కు చెందిన సురేందర్రెడ్డికి రూ. 60 వేలు, కె.శ్రీలతకు రూ.44 వేలు, ఎం. రాములుకు రూ.54 వేలు, స్వప్నకు రూ.34 వేలు, అశోక్ కుమార్కు రూ.60 వేలు, పవన్కుమార్కు రూ.60 వేల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్, ఉప్పల్, నాచారం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు కిరణ్కుమార్రెడ్డి, వేముల సంతోష్రెడ్డి, మేకల ముత్యంరెడ్డి, నాయకులు నాగారం చంద్రశేఖర్, మధుసూదన్రెడ్డి, పన్నాల నిఖిల్రెడ్డి, గరిక సుధాకర్, కాటెపల్లి రవీందర్రెడ్డి, తదితరులు నాల్గొన్నారు.
కొవిడ్ బాధితులను ఆదుకుంటున్నాం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మరి బారినపడి కోలుకున్న చర్లపల్లి డివిజన్, మింట్ కాలనీకి చెందిన జరీనా బేగంకు రూ.60వేలు, మధుసూదన్రెడ్డినగర్కు చెందిన శ్రీధర్, వరలక్ష్మికి రూ.40వేలు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బేతి సభాష్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ధన్పాల్రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు డప్పు గిరిబాబు, నాయకులు కడియాల బాబు, బొడిగె రాజుగౌడ్, సత్తిరెడ్డి, రెడ్డినాయక్, పద్మారెడ్డి, జాన్రెడ్డి, ఎంకిరాల నర్సింహ, గంప కృష్ణ, వినోద్, ఉపేందర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.