మసీదుపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్దపెల్లి జిల్లాకేంద్రంలోని కమాన్చౌరస్తాలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం దహనం చేశారు. అనంతరం బండి సంజయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మసీదుపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేదాకా విడిచిపెట్టేదే లేదన్నారు. ఇక్కడ అఖిలపక్ష నాయకులు సయ్యద్ మస్రత్, షేక్ ఇమామ్, మోహిత్ బాయ్, మెహరాజ్, తదితరులు పాల్గొన్నారు.