నిజామాబాద్ : జిల్లాలో టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రెంజల్ మండలంలోని నీల ఎంపీటీసీ-1 గడ్డం స్వప్న ఎమ్మెల్యే షకీల్ అమెర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరామని ఎంపీటీసీ గడ్డం స్వప్న తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రఫీ, సుల్తాన్, గడ్డం రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, అంతకు ముందు ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నుంచి భారీగా టీఆర్ఎస్లో చేరారు. బీజేపీకి చెందిన మరో ఎంపీటీసీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తన వందలాది మంది అనుచర గణంతో సోమవారం గులాబీ గూటికి చేరారు.
దీంతో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన తరువాత బీజేపీకి రాం రాం చెప్పి టీఆర్ఎస్లో చేరిన ఎంపీటీసీ సభ్యుల సంఖ్య అయిదుకు చేరింది.