ఇల్లందకుంట: టీఆర్ఎస్ పార్టీతోనే హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాత మధు సమక్షంలో ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో సోమవారం చేరారు. వారికి సుంకె రవిశంకర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. ఇంటింటా తిరుగుతూ సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు కోసం శాయశక్తులా కృషిచేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్లో చేరినవారిలో గొట్టె రాజశేఖర్, దాసారపు సంతోష్, రేణికుంట్ల రాజీవ్, రౌతు సాగర్, తదితరులున్నారు.