మర్రిగూడ, అక్టోబర్ 2 : మండలంలోని అంతంపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త సురిగి ముత్తయ్య తిరిగి టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం గట్టుప్పల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ముత్తయ్యకు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
శనివారం చౌటుప్పల్లో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన ముత్తయ్య.. తిరిగి టీఆర్ఎస్లో చేరడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్యాదవ్, ఎంపీటీసీ నేనావత్ బంతిలాల్, మాతంగి బ్రదర్స్ నరేందర్, రవీందర్, మల్లేశ్, నర్సింహ, సురిగి ఎట్టయ్య పాల్గొన్నారు.