అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదాను సాధించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila) ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో ఆమె మాట్లాడారు. ప్రత్యేక హోదాను కల్పించడంలో కేంద్రంలో బీజేపీ(BJP fraud ) ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ది పొందడానికి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ప్రత్యేక హోదాను వాడుకుంటున్నాయే తప్ప వాటి గురించి చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని దుయ్యబట్టారు.
ప్రత్యేక హోదా (Special Status) రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని అన్నారు. ఓటు అనేది ఐదేళ్లకు ఒకసారి ప్రజల వద్దకు వచ్చే ఆయుధమని, ఈ కీలక ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. రాష్ట్రానికి ఏం చేసిందని బీజేపీకి జగన్ గులాంగిరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, జగన్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని రావాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో లిక్కర్,భూ మాఫియా రాజ్యం నడుస్తుందని విమర్శించారు. BJP fraud by not giving special status: YS Sharmila