మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ 6వ వార్డు (ఎస్టీ జనరల్ రిజర్వుడు స్థానం) కౌన్సిల్ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప (45) అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం మక్తల్ మున్సిపల్ పరిధిలోని చందాపూర్ గ్రామం.
ఎన్నికల్లో ఓడిపోతాననే ఒత్తిడిలో మృతుడు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. మహదేవ్ మృతితో చందాపూర్లో విషాదఛాయలు అలుముకున్నారు.