న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జిలను బుధవారం నియమించింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర సింగ్ ఫడ్నవీస్ను గోవా ఎన్నికల ఇన్చార్జిగా నియమించారు. అలాగే కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి, ఎంపీ దర్శన జర్దోష్ కో ఇన్చార్జిలుగా నియామకమయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరప్రదేశ్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని ఉత్తరాఖండ్కు, పంజాబ్కు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను, కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరీ, మీనాక్షి లేఖిని కో ఇన్చార్జిలుగా నియమించారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు మణిపూర్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్, అసోం మంత్రి అశోక్ సింఘాల్కు కో ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాషాయ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదునుపెడుతున్నది.