Bismah Maroof | లాహోర్: పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి బిస్మా మరూఫ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. 2006 నుంచి ఆ జట్టు తరఫున ఆడుతున్న మరూఫ్.. ఇటీవలే వెస్టిండీస్తో ముగిసిన వన్డే సిరీస్లో చివరిసాగా ఆడింది.
15 ఏండ్లకే పాక్ జట్టులో అరంగేట్రం చేసిన ఆమె తన 18 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో 276 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 6,262 పరుగులు చేయడమే గాక బౌలింగ్లో 80 వికెట్లు పడగొట్టింది. పాక్ తరఫున వన్డేలు, టీ20లలో అత్యధిక పరుగులు (ఉమెన్స్ క్రికెట్లో)చేసిన రికార్డు ఆమె పేరిటే ఉంది. 34 వన్డేలు, 62 టీ20లలో ఆమె పాక్ జట్టుకు సారథిగా వ్యవహరించింది.