తిరుమల : బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో టీటీడీ ఆలయం ( TTD Temple ) నిర్మించేందుకు బీహార్ ( Bihar ) ప్రభుత్వం అంగీకరించడంపై టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు( Chairman BR Naidu) హర్షం వ్యక్తం చేశారు. పాట్నాలోని మోకామా ఖాస్ ప్రాంతంలో 10.11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతయ అమృత్ ఈ మేరకు టీటీడీ చైర్మన్కు లేఖ రాశారు.
సదరు భూమిని 99 సంవత్సరాల పాటు రూ. 1 టోకెన్ లీజ్ రెంట్తో ఇవ్వాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీహార్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చైర్మన్ తెలిపారు. ఈ మహత్తరమైన నిర్ణయంతో బీహార్ రాష్ట్రంలో టీటీడీ ధార్మిక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందన్నారు.
ఎంవోయూ చేసుకునేందుకు బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ను అధికారికంగా నియమించిందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పోరేషన్ డైరెక్టర్తో టీటీడీ ప్రతినిధులు త్వరలో సంప్రదింపులు చేసి, టీటీడీ ఆలయ నిర్మాణానికి సంబంధించిన అవసరమైన అన్ని చర్యలు చేపడుతామన్నారు. ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించడంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హెచ్ ఆర్డీ మంత్రి నారా లోకేష్ అభినందించినట్లు చైర్మన్ తెలిపారు.