అమరావతి : పరిషత్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అంశంపై ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆమె స్పష్టంచేశారు. పార్టీ తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారం చేయాలని సూచించారు.
ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు గత శుక్రవారం ప్రకటించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కీలుబొమ్మగా మార్చి ఎన్నికలను పరిహాసాస్పదంగా మార్చిన జగన్ ప్రభుత్వ వ్యవహార శైలిని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుచంద్రబాబు వెల్లడించారు.
ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి