కన్యాకుమారి: ఇవాళ్టి నుంచి భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభిస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. 3570 కిలోమీటర్ల దూరాన్ని ఆయన 150 రోజుల ప్రయాణించనున్నారు. అయితే ఆ సమయంలో రాత్రిపూట రాహుల్ గాంధీ కంటేనర్లలో నిద్రించనున్నారు. జర్నీ మొత్తంలో రాహుల్ ఎక్కడా ఎటువంటి హోటల్లో బస చేయబోరని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. చాలా సింపుల్గా కంటేనర్లలో రాహుల్ నిద్రిస్తారని చెబుతున్నారు. రాహుల్ కోసం ప్రత్యేక కంటేనర్లను నిర్మిస్తున్నారు. దాంట్లో నిద్రపోయేందుకు బెడ్స్, టాయిలెట్లు, ఎసీలను ఏర్పాటు చేశారు.
వివిధ రాష్ట్రాల్లో ర్యాలీ జరుగుతున్న నేపథ్యంలో అక్కడక్కడ భిన్న వాతావరణం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు, తేమను దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్లు కంటేనర్లను డిజైన్ చేశారు. దాదాపు 60 కంటేనర్లను తయారు చేశారు. అవిన్నీ ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నాయి. ఓ గ్రామం మాదిరగా కంటేనర్లను పొందుపరిచారు. రాత్రి పూట బస కోసం ప్రతి రోజు కొత్త ప్రదేశంలో ఆ కంటేనర్లను ఉంచనున్నారు. రాహుల్ గాంధీతో రోజు ఉండే వారు ఆయనతో కలిసి ఆ కంటేనర్లలోనే భోజనం చేస్తారు. 2024 లోక్సభ ఎన్నికల టార్గెట్తో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.