వ్రోక్లా(పోలాండ్): భారత స్టార్ షూటర్ మను భాకర్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్స్ కప్లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. పోలాండ్ వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో ఇరాన్కు చెందిన జవాద్ ఫారూగీతో కలిసి 10 మీటర్ల ఎయిర్పిస్టల్ మిక్స్డ్ డబుల్స్ బరిలోకి దిగిన భాకర్.. తుదిపోరులో 16-8తో మథిల్డే లామొల్లె (ఫ్రాన్స్)-చెర్నోసోవ్ (రష్యా) జంటపై విజయం సాధించింది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో 582 పాయింట్లు సాధించిన భారత్-ఇరాన్ ద్వయం.. సెమీస్లో అగ్రస్థానంతో ఫైనల్కు దూసుకెళ్లింది.